Wednesday, May 15, 2024

పోలీసులే రక్షించాలి.. మహిళల రక్షణ ప్రభుత్వం వల్ల కాదు: పవన్‌ కల్యాణ్‌

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ప్రతి రోజు అత్యాచారాలు, మహిళలపై అఘాయిత్యాలు చోటు-చేసుకోవడం అత్యంత దురదృష్టకరమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లలో బీ ఫార్మసీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేసి హత్యకు పాల్పడిన ఘటన, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచార ఘటన గురించి తెలిసి మనసు వికలమైందని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభంశుభం తెలియని పసివాళ్లపైనా, గర్భిణులపై, మానసిక పరిణతి లేనివారిపై, విద్యార్థినులపై, యువతులపై వరుసగా అఘాయిత్యాలు చోటు-చేసుకొంటు-న్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిపై బాధ్యతగల ప్రతిపక్షంగా మహిళలకు రక్షణ ఇవ్వాలని, వారు ధైర్యంగా తిరిగే పరిస్థితులు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. తామెక్కడా ప్రభుత్వాన్ని నిందించడం లేదని, స్పష్టంగా సూచనలు చేసున్నామని పవన్‌ పేర్కొన్నారు.

బాధితుల వివరాలు గోప్యంగా ఉంచాలని చట్టం స్పష్టంగా చెబుతోందని, బాధితులు, వారి కుటు-ంబాల గౌరవ మర్యాదలు కాపాడాలన్న ఉద్దేశంతోనే చట్టంలో ఆ అంశాన్ని పొందుపరిచారని వివరించారు. బాధిత కుటు-ంబాలకు భరోసా ఇచ్చి, గౌరవం కాపాడి, ధైర్యం చెప్పాల్సిన పాలకులు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా తల్లితండ్రుల పెంపకాన్ని తప్పుబట్టేలా మాట్లాడుతున్నారని, ఈ పరిస్థితులను చూస్తుంటే మహిళల రక్షణ గురించి పాలకులను ఎలాగూ విశ్వసించలేకపోతున్నామని పేర్కొన్నారు. అందువల్ల బాధ్యత కలిగిన పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బందే ప్రత్యేక శ్రద్ధ, చొరవ చూపించి అత్యాచార ఘటనల కట్టడికి చర్యలు తీసుకోవాలి. మృగాళ్లుపట్ల కఠినంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

అసలు ఇలాంటి సంఘటనలు ఎందుకు చోటు-చేసుకొంటు-న్నాయో, ఎలా కట్టడి చేయాలనే అంశంపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష చేసిన దాఖలాలు లేవని విమర్శించారు. విషయ తీవ్రత దృష్ట్యా.. అత్యాచార ఘటనలు ఆగని పక్షంలో హైకోర్టు సుమోటోగా తీసుకోవాలని, మహిళ రక్షణ-కై- ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. వైసీపీ ప్రభుత్వం ఆడబిడ్డలను ఎలాగూ కాపాడలేదని, తమ బిడ్డలు మృగాళ్ల బారినపడకుండా తల్లిదండ్రులే కంటికి రెప్పలా కాపాడుకోవాలని, సదా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నానని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement