Monday, April 29, 2024

గుడి ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎంపీ నామ నాగేశ్వరరావు..

మరిపెడ, ప్ర‌భ‌న్యూస్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయ గూడెం గ్రామంలో టీ.ఆర్.ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠలో ఎమ్మెల్సీ, తెరాస ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజుతో కలసి టీ.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు తర్వాత వారిని నరేష్ రెడ్డి శాలువాతో సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో గుడి ప్రతిష్ట లో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, జడ్పీ చైర్మన్ బిందు సహా పలువురు ప్రజాప్రతినిధులతో కలసి ఎంపీ నామ నాగేశ్వరరావు భోజనం చేశారు. కార్యక్రమంలో రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, నాయకులు చిత్తారు సింహాద్రి యాదవ్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణ చైతన్య, బాణాల వెంకటేశ్వరరావు, నామ సేవా సమితి సభ్యులు చీకటి రాంబాబు, తాళ్లూరి హరీష్ బాబు, రేగళ్ల కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement