Monday, April 29, 2024

మాజీ మంత్రి బొజ్జ‌ల గోపాల‌కృష్టారెడ్డి మృతికి నామ సంతాపం..

మాజీ మంత్రి బొజ్జల గోపాల‌కృష్ణారెడ్డి గారి మృతి పట్ల టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. బొజ్జల తన రాజకీయ జీవితంలో ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేశారన్నారు. ఆయనతో ఎంపీ నామ తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. శ్రీకాళహస్తిలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బొజ్జల, ఉమ్మడి రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వ హయాంలో అటవీశాఖా మంత్రిగా, ఆ తర్వాత ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement