Saturday, May 4, 2024

Breaking: టీడీపీ నేత అశోక్ గజపతిరాజుపై కేసు నమోదు

టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజుపై కేసు నమోదు అయింది. రామతీర్థం ఆలయ నిర్మాణ శంకుస్థాపన వద్ద జరిగిన ఘటనపై పోలీసులకు ఈవో ఫిర్యాదు చేశారు. శంకుస్థాపన ఏర్పాట్లు వద్ద తమ విధులకు ఆటంకం కలిగించారని అశోక్ గజపతిరాజుపై ఫిర్యాదు చేశారు. దీంతో అశోక్ గజపతి రాజుతో పాటు మరికొందరిపై కేసు నమోదైంది. 473,353 సెక్షన్ల కింద నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేశారు.

కాగా నిన్న(డిసెంబర్ 22) రామతీర్థం కొండపై రామాలయ నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఆలయ ధర్మకర్త అశోక్ గజపతి హాజరయ్యారు. అయితే వీరిద్దరి మధ్య ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. అశోక్ గజపతిరాజును కొబ్బరికాయ కొట్టకుండా వెల్లంపల్లి అడ్డుకున్నారు. దీంతో అశోక్ గజపతి రాజు అనుచరులు శంకుస్థాపన ఫలకాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వివాదం చెలరేగింది. ఈ ఘటన అనంతరం మంత్రులు వెల్లంపల్లి, బొత్స సత్యనారాయణలు ఆశోక్ గజపతి రాజుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement