Thursday, May 2, 2024

ఫోటో షూట్.. డ్రామాలు చేయడమే చంద్రబాబు నైజం.. సీఎం జగన్

ఫోటో షూట్.. డ్రామాలు చేయడమే చంద్రబాబు నైజమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాజమండ్రిలో పెన్షన్ వారోత్సవాల కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ… ఎన్టీఆర్ పార్టీ, ఎన్టీఆర్ ట్రస్ట్, ఎన్టీఆర్ శవాన్ని కూడా లాక్కున్నారని అన్నారు. పొడిచేది, చంపేది.. మొసలి కన్నీరు కార్చేది ఈ పెద్ద మనిషే అన్నారు. ఫోటోషూట్, డ్రోన్ షాట్ల కోసం గోదావరి పుష్కరాల్లో 28మందిని చంపేశారన్నారు. వేల మందిని ఒక్క గేటులో పంపించి 29మందిని చంపేశారన్నారు. చంద్రబాబు అరాచకాలను దత్తపుత్రుడు ప్రశ్నించడని అన్నారు. తానే మనుషుల్ని చంపేసి.. తానే మానవతావాదిలా డ్రామాలు కూడా ఆడుతున్నారన్నారు. జాబు రావాలంటే బాబు రావాలని అన్నాడు.. బాబు వచ్చాడు కానీ.. జాబు రాలేదన్నారు. సొంత మామనే మోసం చేసిన వ్యక్తికి ప్రజలను మోసం చేయడం ఓ లెక్కనా అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement