Friday, April 19, 2024

జీవోలోని నిబంధనలు అందరికీ వర్తిస్తాయి : ప్రభుత్వ సలహాదారు సజ్జల

ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోలోని నిబంధనలు అందరికీ వర్తిస్తాయి అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. జీవో వెనుక రాజకీయ ఉద్దేశాలు లేవని, విపక్షాలే రాజకీయం చేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు. రాజకీయ పార్టీలు సభలు సమావేశాలు నిర్వహించొద్దని చెప్పలేదని, ప్రజలకు ఇబ్బంది లేకుండా గ్రౌండ్‌లలో నిర్వహించుకోవచ్చు అని జీవోలో పేర్కొనడం జరిగిందన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. రోడ్లు ఉన్నది ప్రయాణాల కోసమే కానీ.. బహిరంగ సమావేశాల కోసం కాదు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement