Friday, April 26, 2024

AP : పవన్ కల్యాణ్‌ను ఓడిస్తా.. కేఏ పాల్

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఓడిస్తాన‌ని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏపాల్ అన్నారు. పవన్ కల్యాణ్‌పై మరోసారి ఆయ‌న‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సీక్రెట్‌గా పిఠాపురం వెళ్తే వంద, రెండు వందల మంది దగ్గరకు వచ్చారని తెలిపారు. అందులో 80శాతం మంది కాపులే అని.. వారంతా తనను పిఠాపురం నుంచి పోటీ చేయాలని కోరుతున్నారన్నారు. అయినా తాను ఎంత మందికి వ్యతిరేకంగా పోటీ చేయాలన్నారు. ప్రజలకు బుద్ధి ఉంటే పవన్ కల్యాణ్‌ను చిత్తుగా ఓడించాలన్నారు.

పాలకొల్లు వెళ్లి అప్పట్లో చిరంజీవిని ఓడించా అన్నారు. అక్కడ ప్రత్యేకంగా క్యాంపెయిన్ చేశా అన్నారు. ఆనాడు ఫ్లైట్ మిస్ అయిందని లేదంటే తిరుపతి కూడా వెళ్లేవాడినని వెళ్తే ఫలితం మరోలా ఉండేదన్నారు. దాంతోనే చిరంజీవి తిరుపతిలో 5 వేల ఓట్లతో గెలిచారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement