Saturday, April 27, 2024

క‌రోనా నుంచి కోలుకున్న‌ జ‌న సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్

హైద‌రాబాద్ – జ‌న సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌రోనా నుంచి కోలుకున్నారు.. ఈ మేర‌కు జ‌న‌సేన మీడియా సెల్ అధికారికంగా ప్ర‌క‌టన విడుద‌ల చేసింది.. గ‌త నెల‌లో క‌రోనా భారీన ప‌డిన ప‌వ‌న్ ఐసోలేష‌న్లో ఉండి వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స చేయించుకుంటున్నారు.. క‌రోనా ల‌క్ష‌ణాలు లేక‌పోవ‌డంతో మూడు రోజుల కింద‌ట ఆర్ పి టి సి ఆర్ టెస్ట్ నిర్వ‌హించారు..నేడు వెలువ‌డిన ఆ టెస్ట్ ఫ‌లితాల‌లో నెగిటివ్ వ‌చ్చింది..కాస్త నీర‌సంగా మాత్ర‌మే ఉన్నార‌ని, ప్ర‌స్తుతం విశ్రాంతి తీసుకుంటున్నార‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.. త‌న ఆరోగ్యం కోసం ప్రార్ధ‌న‌లు చేసిన వారికి, త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించిన వారంద‌రికీ ప‌వ‌న్ క‌ల్యాణ్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.. క‌రోనా తీవ్రంగా ఉన్న క్లిష్ట ప‌రిస్థితుల‌లో అంద‌రూ కొవిడ్ నిబంధ‌ల‌ను పాటించాల‌ని కోరారు…సాధ్య‌మైనంత వ‌ర‌కు ఇళ్ల‌లోనే ఉండి క‌రోనా భారీన ప‌డ‌కుండా ఎవ‌రికి వారు కాపాడుకోవాల‌ని కోరారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement