Friday, April 26, 2024

లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. 30 మందికి గాయాలు

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడిభీమవరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 30 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను శ్రీకాకుళం జీజీహెచ్​కు తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రైవేటు బస్సు ఒడిశా నుంచి కేరళ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో బస్సు ముందు భాగమంతా నుజ్జునుజ్జు అయింది. కాగా, బాధితులంతా ఒడిశాకు చెందిన వలస కూలీలుగా పోలీసులు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement