Tuesday, May 7, 2024

3 నుంచి ఓపెన్‌ స్కూల్‌ సప్లిమెంటరీ పరీక్షలు.. పది, ఇంటర్‌ విద్యార్థుల కోసం ఏర్పాట్లు..

అమరావతి, ఆంధ్రప్రభ: ఓపెన్‌ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఆగస్టు మూడో తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు బుధవారం ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం షెడ్యూల్‌ విడుదల చేసింది. పదో తరగతి పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఇంటర్మీడియట్‌కు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.

మూడో తేదీన పదో తరగతి 205- తెలుగు, 206- ఉర్దూ, 208- కన్నడ, 233- ఒరియా, 237- తమిళం, ఇంటర్‌ 301- హిందీ, 305- తెలుగు, 306- ఉర్దూ పరీక్షలు జరుగుతాయి. 4వ తేదీన 202- ఇంగ్లిష్‌, 302- ఇంగ్లిష్‌, ఐదున 211- గణితం, భారతీయ సంస్కృతి, వారసత్వం, 311- గణితం, 315- చరిత్ర, 320- వ్యాపార గణక శాస్త్రం, ఆరో తేదీన 21- శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం, 216- గృహ విజ్ఞాన శాస్త్రం, 312- భౌతిక శాస్త్రం, 317- రాజనీతి శాస్త్రం, పౌర శాస్త్రం, 328- మనో విజ్ఞాన శాస్త్రం, 8న 213- సాంఘిక శాస్త్రం, 214- ఆర్థిక శాస్త్రం, 313- రసాయన శాస్త్రం, 318- ఆర్థిక శాస్త్రం, 331- సామాజిక శాస్త్రం, 10న 201- హిందీ, 314- జీవ శాస్త్రం, 319- వాణిజ్య, వ్యాపార శాస్త్రం, 321- గృహ విజ్ఞాన శాస్త్రం, 11న 215- బిజినెస్‌ స్టడీస్‌, 222- మనో విజ్ఞాన శాస్త్రం, అన్ని వృత్తి విద్యా సబ్జెక్టులకు, ఇంటర్‌లో కూడా అన్ని వృత్తి విద్యా సబ్జెక్టులకు పరీక్షలు జరుగుతాయి. ఇంటర్‌ జనరల్‌, ఒకేషనల్‌ విద్యా కోర్సులకు ఆగస్టు 17 నుంచి 20వ తేదీ వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు జరగనున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement