Sunday, May 19, 2024

దేవుని సన్నిధిలో తేనెటీగల దాడి… ఒక‌రి మృతి

నంద్యాల జిల్లా ,మాడుగులలో తేనెటీగలు దాడి చేశాయి. ఘటనలో ఒకరి మృతి చెందగా, 30 మందికి తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో చికిత్స పొందుతూ ఒకరు చనిపోగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కాగా,నందికొట్కూరు నియోజకవర్గం,కొత్తపల్లి మండలం మాడుగుల గ్రామంలో పాతకోట గ్రామానికి చెందిన చిలకల వంశస్థులు దంతాల లింగమయ్య… దేవుని జాతర నిర్వహిస్తుండగా ఒక్కసారిగా తేనెటీగల దాడి చేశాయి. వీటి దాడిలో సుమారు 50 మంది వరకు గాయపడ్డారు.
ఆత్మకూరు పట్టణానికి చెందిన కాశీశ్వర్ రెడ్డి పై తేనెటీగలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన అతన్ని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయ‌ప‌డిన వారందర్ని హాస్ప‌ట‌ల్లో చేర్చారు.. ఘ‌ట‌న వివ‌రాల‌ను పోలీసులు సేక‌రిస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement