Monday, May 6, 2024

అవినాష్ కు ఊర‌ట – 19న విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌న్న సిబిఐ..

హైద‌రాబాద్ – మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈ రోజు విచారణకు రాలేనంటూ ఎంపీ అవినాశ్ రెడ్డి రాసిన లేఖపై సీబీఐ స్పందించింది. ఈ నెల 19న తమ ముందు హాజరుకావాలంటూ అధికారులు మరోసారి నోటీసులిచ్చారు. హైదరాబాద్ నుంచి పులివెందులకు అవినాశ్ రెడ్డి బయల్దేరగా దారి మధ్యలో ఉండగా వాట్సాప్ ద్వారా నోటీసులు పంపారు. హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని సూచించారు. వివేకా హత్య కేసు విచారణకు హాజరుకావాలంటూ ఎంపీ అవినాశ్ రెడ్డికి సోమవారం సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం 11 గంటలకు సీబీఐ కార్యాలయంలో హాజరు కావాలని అందులో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సీబీఐకి లేఖ రాసిన అవినాశ్ రెడ్డి.. అత్యవసర పనుల కారణంగానే విచారణకు రాలేకపోతున్నానని చెప్పారు. నాలుగు రోజుల గడువు కావాలని కోరారు. దీంతో సిబిఐ ఈ నెల 19న విచార‌ణ‌కు రావాల‌ని కోరుతూ నోటిస్ పంపింది.. కాగా, ప్ర‌స్తుతం అవినాష్ రెడ్డి పులివెందుల‌లో ఉన్నారు.. అక్క‌డ ఏర్పాటు చేసిన ప‌లు కార్యక్ర‌మాల‌లో పాల్గొన‌నున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement