Friday, April 26, 2024

వీళ్లు మనుషులేనా.. బ్రతికి ఉండగానే కాటికి పంపాలనుకున్నారు

ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరగడం, ఆస్పత్రుల్లో ఎక్కడా బెడ్లు దొరక్కా కరోనా బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్ప్రతుల్లో బెడ్ల కొరత తీవ్రంగా ఉంది.  కృష్ణా జిల్లా తిరువూరులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.  చీరాల సెంటర్ లోని ఒక అపార్ట్‌ మెంట్ లో వృద్ధురాలు కరోనాతో చనిపోయిందని ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లమని కుటుంబసభ్యులు కోరారు. అయితే అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఎవరు ముందుకు రాకపోవడంతో స్దానిక కౌన్సిలర్ పరసా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఓ స్వచ్ఛంద సభ్యులకు సమాచారం అందించారు. అయితే, వృద్ధు‌రాలు కొన ఊపితో ఉన్నట్లు గుర్తించారు. అయినప్పటికీ ఆమె దగ్గరకు వెళ్లడానికి కుటుంబ సభ్యులు మందుకు రాలేదు. అయితే, వృద్దురాలి మెడలోని బంగారు వస్తువులు తెంపి ఇవ్వమని స్వచ్చంద సేవకులను కోరాడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement