Thursday, April 25, 2024

సీఎం జగన్ ట్వీట్ కు జేఎంఎం కౌంటర్

 

కరోనా కష్టకాలంలో ప్రధానికి అందరూ అండగా నిలవాలని, రాజకీయాలకు ఇది సమయం కాదంటూ ఝార్ఖండ్ సీఎంను ఉద్దేశించి ఏపీ సీఎం జగన్ చేసిన ట్వీట్ రాజకీయంగా దూమారం రేపుతోంది. సీఎం జగన్ వ్యాఖ్యలపై ఝార్ఖండ్ అధికార పార్టీ ఝార్ఖండ్ ముక్తి మోర్చా గట్టిగా బదులిచ్చింది. జగన్ కంటే ఝార్ఖండ్ సీఎం ఎంతో పరిణతి ఉన్న నేత అని పార్టీ ప్రధాన కార్యదర్శి సుప్రియో భట్టాచార్య పేర్కొన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసమే సీఎం జగన్ ఆ విధంగా స్పందించినట్టు అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా బీజేపీకి దగ్గరయ్యేందుకు ఏపీ జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఏపీకి కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం అందుతోందని, కానీ కేంద్రం వైఖరితో అనేక రాష్ట్రాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement