Friday, May 3, 2024

ఎన్టీ రామారావు శత జయంతి ఉత్సవాలు – పోరంకి నుంచి LIVE

విజయవాడ – తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు శత జయంతి ఉత్సవాలు విజయవాడలోని పోరంకిలోని అనుమోలు గార్డెన్స్‌లో ప్రారంభ‌మ‌య్యాయి.. . ఈ వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు సూపర్ స్టార్ రజినీకాంత్ పాల్గొంటున్నారు…అలాగే తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడు, ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌తో పాటు ప‌లువురు టిడిపి నాయ‌కులు వేదిక‌ను పంచుకున్నారు.

. కాగా ఈ ఉత్సవాలలో మొత్తం 10 వేల మంది కూర్చునేందుకు వీలుగా కుర్చీలు వేశారు. సభా ప్రాంగణాన్ని మూడు భాగాలుగా విభజించారు. ‘ఎన్’ విభాగంలో విశిష్ఠ అతిథులు, ‘టి’ విభాగంలో అతిథులు, ‘ఆర్’ విభాగంలో సామాన్యులు కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. అలాగే, వేడుకలకు హాజరయ్యే వారి కోసం నాలుగైదు చోట్ల పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. ప్రాంగణం చుట్టూ మరో 20 వేల మంది వరకు కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలు, అసెంబ్లీ ప్రసంగాల సావనీర్‌ను విడుదల చేస్తారు. అలాగే, ఎన్టీఆర్‌పై ప్రముఖ జర్నలిస్టు వెంకటనారాయణ రాసిన పుస్తకాన్ని కూడా ఈ సందర్భంగా ఆవిష్కరిస్తారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్య‌క్ష్య ప్ర‌సారంగా తిల‌కించ‌గ‌ల‌రు..

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement