Saturday, April 27, 2024

AP | వైభవంగా నిర్మమహేశ్వర స్వామి రథోత్సవం..

పశ్చిమ ప్రకాశం ప్రతినిధి, ప్రభ న్యూస్ : ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని నిర్మమహేశ్వర స్వామి రథోత్సవం శనివారం అశేష భక్త జన సందోహం శివ నామ స్మరణతో వైభవంగా జరిగింది. రధోత్సవాన్ని గిద్దలూరు ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త అన్నా వెంకట రాంబాబు ప్రారంభించారు.

మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సుమారు మూడు గంటలకు ప్రారంభమైన రథోత్సవం రెండు గంటల పాటు తిరువీధుల్లో కొనసాగింది. రథోత్సవం సందర్భంగా భక్తులకు స్వచ్ఛంద సంస్థలు అన్నప్రసాదాలు, మంచినీరు ఏర్పాటు చేశారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement