Monday, April 29, 2024

ముత్యాలమ్మ ను దర్శించుకున్న ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ దంపతులు

చిలుకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలసివున్న శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ వారి జాతర మహోత్సవ వేడుకలు గత మూడు రోజుల నుండి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మూడో రోజు జాతర చివరి రోజుl శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారిని ఎమ్మెల్సీ బల్లి కళ్యాణచక్రవర్తి ఆయన సతీమణి డాక్టర్ శ్వేత దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారికి వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వేమారెడ్డి మురళి మోహన్ రెడ్డి, ఆలయ సభ్యులు దువ్వూరు సాయి క్రిష్ణా రెడ్డి, ఉప్పల ప్రభాకర్, నందవరం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement