Saturday, April 20, 2024

ఆర్జీవి దెయ్యం – ట్రైలర్ చూస్తే భయం పుట్టాల్సిందే !!

హర్రర్ సినిమాలకైనా. .కాంట్రవర్సీ చేయడానికైనా వర్మ తర్వాతే ఎవరైనా. ఆయనలో క్రియేటివిటీ ఎంత ఉందో కొత్తగా సినీ అభిమానులకు చెప్పనవసరం లేదు. గతంలో ఆర్జీవి ఎన్నో హర్రర్ సినిమాలతో ప్రేక్షకులను భయపెట్టాడు. ఇప్పుడు తాజాగా ఆర్జీవి దెయ్యం సినిమా పేరుతో ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధంగా ఉన్నాడు.

కాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశాడు. ఈ సినిమాలో రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తుండగా స్వాతి దీక్షిత్, తనికెళ్ళభరణి, అనితా చౌదరి, జీవ, బెనర్జీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే దెయ్యం పట్టిన అమ్మాయి గా స్వాతి దీక్షిత్ అదరగొట్టింది. ఆమె తండ్రి పాత్రలో రాజశేఖర్ కూడా వితౌట్ మేకప్ నటించారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా ఈ సినిమా ఏప్రిల్ 16న తెలుగు, తమిళ్ ,మలయాళం ,కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతోంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement