Friday, March 29, 2024

ఉద్యోగికి సన్మానం..

ముత్తారం: ఇటీవల ప్రభుత్వ కొలువు సాధించిన పంచాయితీ కార్యదర్శి బుర్ల రాజేందర్‌ను మాజీ ఎంపీపీ రైతు బంధు సమితి అధ్యక్షుడు అత్తె చంద్రమౌళి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. మండలంలోని లక్కారం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో రాజేందర్‌ను శాలువాతో సత్కరించారు. ఈకార్యక్రమంలో టిఆర్‌స్‌ గ్రామ శాఖ అధ్యక్షుడు మాదాసి రమేష్‌, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు బర్ల కొమురయ్య, వార్డ్‌ సభ్యులు బ్రహ్మణపెళ్లి కుమారస్వామి, వీరగొని సారయ్య, కాసిపేట మధునయ్య, టిఆర్‌ఎస్‌ యూత్‌ అధ్యక్షుడు కొప్పుల సంతోష్‌, యూత్‌ ప్రధాన కార్యదర్శి జంగపెళ్లి రాజశేఖర్‌, బర్ల సధన్‌, కోటి, లింగయ్య, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement