Saturday, April 27, 2024

గౌతమ్ రెడ్డి సేవలు మరువలేనివి : మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి

వరికుంటపాడు : దివంగత మంత్రి, మేకపాటి గౌతమ్ రెడ్డి మరణించి సంవత్సరం అయినను ఇప్పటికి మా ముందే ఉన్నట్లుగా ఉందని ఆయన జిల్లాకు చేసిన సేవలను ఎప్పటికీ మరువలేనివని కావలి మాజీ శాసనసభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు వంటేరు వేణుగోపాల్ రెడ్డి అన్నారు మర్రిపాడు మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో దివంగత గౌతమ్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని గౌతంరెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. గౌతమ్ రెడ్డి నెల్లూరు జిల్లాకు చేసిన సేవలను గురించి కొనియాడారు. అనంతరం మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి లతో మాట్లాడారు.. గౌతమ్ రెడ్డికి నివాళులర్పించిన వారిలో ఉదయగిరి మాజీ ఏఎంసి చైర్మన్ షేక్ అలీ అహ్మద్, వింజమూరు జడ్పిటిసి గణపం బాలకృష్ణారెడ్డి, మాజీ మండల కన్వీనర్లు మండలపు తిరుపతి నాయుడు, మలిరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి, మాజీ మండల బూత్ కన్వీనర్ మాగంటి శ్రీనివాసులు, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు షేక్ జిలాని భాష, సర్పంచ్లు ప్రభాకర్ రెడ్డి, చల్లకొలుసు నాగరాజు చంచల మధు, ఆవులయ్య, కుందూరు కొండయ్య, మేడిద వెంకటేశ్వర్లు, అబుసలం తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement