Tuesday, April 30, 2024

నెల్లూరు జిల్లా సంగంకు చేరుకున్న సీఎం జ‌గ‌న్‌

మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రత్యేక హెలికాప్టర్ లో నెల్లూరు జిల్లాలోని సంగం గురుకుల పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. ముఖ్యమంత్రికి రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీద మస్తాన్ రావు, ఆదాల ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు, జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్ ఆనం అరుణమ్మ, శాసన మండలి సభ్యులు పోతుల సునీత, తూమాటి మాధవ రావు, శాసన సభ్యులు, కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు ఛైర్పర్సన్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి,రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ ఏం.చిరంజీవి రెడ్డి, రాష్ట్ర జలవనరుల శాఖ ప్రధాన కార్యదర్శి శశి భూషణ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కెవియన్ చక్రధర్ బాబు, డిఐజి త్రివిక్రమ్ వర్మ, జిల్లా ఎస్పి విజయారావు, నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement