Thursday, May 2, 2024

Breaking: క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సురేష్ రైనా

మిస్టర్‌ ఐపీఎల్‌గా పేరు తెచ్చుకున్న టీమిండియా మాజీ క్రికెటర్‌ సురేష్ రైనా అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. ఆయన అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. అంతర్జాతీయ క్రికెట్ తో పాటు అన్ని ఫార్మాట్లకు రైనా గుడ్ బై చెప్పారు. తాజాగా దేశవాళీ క్రికెట్‌తో పాటు, ఐపీఎల్‌కు సైతం గుడ్‌బై చెప్పాడు. ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఇప్పటికే మంచి టాలెంటెడ్‌ యువ క్రికెటర్లు ఉన్నారని.. యువకులకు అవకాశం ఇవ్వడం కోసం తాను దేశవాళీ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు రైనా పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ఉత్తర్‌ ప్రదేశ్‌ క్రికెట్‌ బోర్డుతో పాటు బీసీసీఐకి వెల్లడించినట్లు రైనా ప్రకటించాడు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement