Saturday, April 27, 2024

నెల్లూరులో ఇద్దరు వ్యక్తుల దారుణ హత్య..

ఇద్ద‌రు వ్య‌క్తుల‌కు గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు దారుణంగా కొట్టి చంపిన ఘ‌ట‌న నెల్లూరు న‌గ‌రంలో చోటుచేసుకుంది. నగరంలోని తెలుగుగంగ టైలర్స్ కాలనీ సమీపంలోని ప్రభుత్వ మద్యం దుకాణం సమీపంలో ఇద్దరు స్నేహితులు మద్యం సేవిస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తులు అక్కడికి వచ్చి వారిని కత్తులతో దారుణంగా పొడిచి చంపారు. పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థలికి చేరుకున్న విచారణ చేపట్టారు. దర్యాప్తులో పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement