Tuesday, April 30, 2024

వ్యక్తి పై ఎలుగు బంటి దాడి

మర్రిపాడు : మర్రిపాడు మండల పరిధిలోని పడమటి నాయుడు పల్లి గ్రామ అడవిలో కుంటా చిన్నయ్య అనే వ్యక్తి పై ఎలుగుబంటి దాడి చేసిన సంఘటన శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి… నాయుడు పల్లికి చెందిన కుంటా చిన్నయ్య రెండు రోజులుగా తమ గేదెలు కనిపించకపోవడంతో వాటిని వెతికేందుకు శుక్రవారం తెల్లవారుజామున అడవికి బయలుదేరి వెళ్ళాడు. వెతుకుతున్న క్రమంలో వెలుగుబంటి చిన్న‌య్య పై దాడి చేసింది. కేకలు వేయడంతో అటుగా వచ్చిన ఓ వ్యక్తి చిన్నయ్య దగ్గరకు పరిగెత్తడం తో వెలుగుబంటి అడవుల్లోకి పారిపోయినట్లు బాధితుడు తెలిపాడు. చిన్నయ్య ఫోన్ ద్వారా తమ కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు ట్రాక్టర్ లో వచ్చి బాధితుడిని గ్రామానికి తీసుకొచ్చి మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక వాహనంలో ఆత్మకూరుకు తరలించారు.  చిన్నయ్యకు మొఖం చేతిపై గాయాలయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement