Friday, May 17, 2024

రాహుల్ గాంధీకి మరోసారి ఈడీ నోటీసులు

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీకి నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 13న విచారణకు హాజరవాలని ఆదేశించింది. కాగా, ఈ నెల 1వ తేదీన పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. గురువారం రాహుల్‌, జూన్‌ 8న సోనియా ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు రావాలని అందులో పేర్కొన్నది. అయితే ప్రస్తుతం తాను విదేశీ పర్యటనలో ఉన్నానని, జూన్‌ 5 తర్వాత విచారణకు హాజరవుతానని రాహుల్‌ ఈడీకి లేఖ రాశారు. దీంతో విచారణ తేదీని ఈనెల 13వ తేదీకి మార్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement