Monday, May 6, 2024

AP | లోడర్ ఢీకొని ఓడరేవు కార్మికుడి మృతి.. కృష్ణ‌ప‌ట్నంలో ఘ‌ట‌న‌

ముత్తుకూరు, (ప్రభ న్యూస్): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టులో ఘోరం జ‌రిగింది. అక్క‌డ పనిచేస్తున్న ఒడిశాకు చెందిన కార్మికుడు ఇవ్వాల (బుధ‌వారం) సాయంత్రం లారీ ఢీకొని చ‌నిపోయాడు. కృష్ణపట్నం పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఒడిశాకు చెందిన బి. విశ్వనాథ్ (33), శివ ఇంజనీరింగ్ కంపెనీలో వెల్డర్ గా పనిచేస్తున్నాడు.

ఓడరేవు భూభాగంలోని నాలుగో బెర్త్ వద్ద సెల్ ఫోన్లో మాట్లాడుతూ నడిచి వెళ్తుంటే.. వెన‌క నుంచి వ‌చ్చిన లోడర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే చ‌నిపోయాడు. లోడర్ కింద కార్మికుడు నలిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంపై మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయలేదని స్థానిక ఎస్సై అంజిరెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement