Sunday, May 19, 2024

కుసుమ జగదీష్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం.. మంత్రి ఎర్రబెల్లి

ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ కుటుంబానికి బి.ఆర్.ఎస్ పార్టీ అండగా ఉంటుందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ములుగు జిల్లా, మల్లంపల్లి గ్రామంలో జరిగిన కుసుమ జగదీష్ పెద్దకర్మకు హాజరై వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, కుటుంబసభ్యులను పరామర్శించి సంతాప సభలో పాల్గొన్నారు.

. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ… జగదీశ్ మృతి తనకు తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. తెలంగాణ ఉద్యమకారుడిగా నాటి ఉద్యమంలో జగదీష్ చురుకైన పాత్ర పోషించారన్నారు. ములుగు జిల్లా పార్టీ అధ్యక్షుడుగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా జగదీష్ నన్ను కలిసినప్పుడల్లా ములుగు ప్రాంత అభివృద్ధికి కావాల్సిన నిధుల గురించే అడిగేవారని గుర్తు చేసుకున్నారు. వారితో వున్న మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement