Saturday, April 27, 2024

చెరువులో ఈతకి వెళ్లి బాలుడు మృతి..

ముత్తుకూరు ఏప్రిల్ 17 (ప్రభ న్యూస్) : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని పెద్ద చెరువులో ఈతకు వెళ్లిన ఓ బాలుడు దుర్మ‌ర‌ణం చెందారు. చరణ్ (14) అనే బాలుడు తన స్నేహితులతో కలిసి పెద్ద చెరువులోకి ఈతకు వెళ్ల‌గా మునిగిపోవడం జరిగింది. నిన్న రాత్రి వరకు తమ కుమారుడు ఇంటికి రాకపోవడంతో బాలుడి స్నేహితులను ప్రశ్నించినప్పటికీ ఫలితం లేకపోగా స్థానిక పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో స్థానిక ఎస్సై శివ కృష్ణారెడ్డి విచారించగా చెరువు వద్దకు వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహం నీళ్లపై తేలాడుతూ కనిపించింది. కుటుంబ సభ్యుల సమక్షంలో బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. చనిపోయిన బాలుడు స్థానిక ఇందిరమ్మ కాలనీకి చెందినవాడని పోలీసులు గుర్తించారు. అనంత‌రం పోలీసులు కేసు న‌మోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్ప‌త్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement