Thursday, May 9, 2024

ఉన్న మాటంటే ఉలుకెందుకు.. ఏపీ మంత్రులపై హరీశ్ రావు ఫైర్

ఉన్న మాటంటే ఉలుకెందుకని తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఏపీ మంత్రులపై ఫైర్ అయ్యారు. ఏపీ మంత్రులపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు మరోసారి ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో ఓ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొని మాట్లాడుతూ… తెలంగాణలో అన్ని పథకాలు బాగున్నాయన్నారు. ఇదే మాట చెప్పానే తప్ప.. ఏపీ ప్రజల్ని తిట్టలేదన్నారు. కానీ అక్కడి మంత్రులు ఎగిరెగిరి పడుతున్నారన్నారు. ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కుపై మౌనం ఎందుకని ప్రశ్నించానన్నారు. ఇందులో ఏమైనా తప్పుందా ? అని హరీశ్ రావు ప్రశ్నించారు. మీకు చేతనైతే ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు పై పోరాడండి అని అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement