Friday, April 26, 2024

ఓటరు చైతన్యం కోసం 2కె రన్

గూడూరు రూరల్: ఓటర్లలో చైతన్యం కోసం 2కె రన్ నిర్వహించి ఓటర్లకు అవగాహన కల్పించడం జరుగుతుందని పురపాలక కమిషనర్ ఓబులేసు,తహసీల్దార్ శ్రీనివాసులు,పట్టణ సీ.ఐ దశరథరామారావు పేర్కొన్నారు. మునిసిపల్,రెవెన్యూ,పోలీసు, విద్యాశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 17న తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలలో భాగంగా ప్రజలను ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్యపరుస్తున్నామన్నారు. రాజ్యాంగ బద్దంగా పౌరునికి ఓటు కల్పించబడిందని ఓటు విలువ తెలుసుకుని ప్రతిఒక్కరు జరగనున్న ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకుని ఉత్తమ ప్రజాప్రతినిధులను చట్టసభలు పంపాలని కోరారు.అనంతరం సంగం థియేటర్ సెంటర్ నుంచి టవర్ క్లాక్ వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement