ఎల్లారెడ్డిపేట : మండలంలోని బోప్పాపూర్ గ్రామానికి చెందిన దివ్యాంగ బాలుడికి తాత్కాలిక ఉద్యోగులు ఆర్ధిక సహాయం చేశారు. పుట్టుక తోనే సాత్విక్ మెదడు సంబంధిత వ్యాధి ,కాళ్ళు చేతులు పని చేయవు,వెన్నెముక పని చేయక నడువ లేని స్థితిలో జన్మించాడు. చలించిన మండల రెవిన్యూ కార్యాలయంలో తాత్కాలిక ఉద్యోగులు అయిన బోప్పాపూర్ గ్రామానికి చెందిన నదీం,ఎల్లారెడ్డి పేటకు చెందిన దుర్గం సూర్య ప్రకాష్ 3 వేళ రూపాయలు ఆర్థిక సహాయం అందించారు..తల్లి దండ్రులు లేని సాత్విక్ వృద్దు రాలయిన నానమ్మ పెంచి పోషిస్తుంది .సాత్విక్ వైద్య ఖర్చుల నిమిత్తం నెలకు అధికంగా ఖర్చు అవుతున్నందున పేదరికం లో మగ్గుతున్న సాత్విక్ నానమ్మ కు బారం కావడం తో దాతలు ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement