Wednesday, April 24, 2024

ధాన్యం కొనుగోలులో ముందుండాలి – సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల

పెద్దపెల్లి – ధాన్యం కొనుగోలు లో పెద్దపెల్లి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని అమర్ చంద్ కళ్యాణమండపంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ రైతులు కష్టించి పండించిన పంటను కొనుగోలు చేయడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పదిహేను రోజులపాటు కొనుగోలు కేంద్రాల్లో కష్టించి పనిచేస్తే కొనుగోళ్లు పూర్తవుతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement