Thursday, May 2, 2024

NARA LOKESHజనవరి 4 నుంచి ‘జయహో బీసీ’

మంగళగిరి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి బీసీల ద్రోహి అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, వైకాపా పాలనలో బీసీలకు జరిగిన అన్యాయంపై వారిలో చైతన్యం కల్పించేందుకు జనవరి 4 నుంచి ‘జయహో బీసీ’ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు.

‘జయహో బీసీ’ రెండు నెలల పాటు కొనసాగుతుందని చెప్పారు. కార్యక్రమం తొలి విడతలో పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాల్లో పర్యటిస్తామన్నారు. ఈ క్షేత్రస్థాయి పర్యటనలోనే బీసీల కష్టాలు తెలుసుకుంటామన్నారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి బీసీల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేస్తామని ప్రకటించారు.

వ్యూహం చిత్రానికి ప్రతివ్యూహం ఉండకూడదంటే ఎలా?:

వ్యూహం చిత్రానికి ప్రతివ్యూహం ఉండకూడదంటే ఎలా అని తె నారా లోకేశ్‌ ప్రశ్నించారు. . ‘‘ఎన్నికల ముందు ఈ తరహా సినిమాలు తీయడం ఓ ఫ్యాషన్ అయిపోయింది. ఇలాంటి సినిమాలకు జగనే డబ్బులు పంచుతున్నారు. దర్శకుడు ఆర్జీవీ తరఫున కోర్టుల్లో వాదనలు వినిపిస్తున్నదీ వైకాపా ఎంపీ నిరంజన్ రెడ్డే. ఆర్జీవీ నిజంగా సినిమా తీయాలంటే హూ కిల్డ్ బాబాయ్, కోడి కత్తి, ప్యాలెస్‌లో జరుగుతున్న అవినీతి మీద తీయొచ్చు’’ అని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement