Sunday, May 5, 2024

Nara Lokesh – 20న విశాఖ‌లో యువగళం జైత్రయాత్ర విజయోత్సవ సభ..

అమరావతి: జనగళమే యువగళమై మహా ప్రభంజనంలా సాగి రాష్ట్ర రాజకీయ యవనికపై చరిత్ర సృష్టించిన యువగళం పాదయాత్ర ముగింపుసభ ఈనెల 20వతేదీన విశాఖపట్నంలో జరగనుంది. భోగాపురం ఎయిర్ పోర్టు సమీపాన గల పోలేపల్లిలో విజయోత్సవసభ నిర్వహణ కోసం పార్టీ కేంద్ర నాయకత్వం ప్రత్యేక కమిటీలను నియమించింది. నిర్వహణ కమిటీ బాధ్యులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన యువగళం విజయోత్సవసభను జయప్రదం చేయాల్సిందిగా పార్టీ నాయకత్వం విజ్ఞప్తి చేసింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిధులుగా హాజరయ్యే యువగళం ముగింపుసభకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది ప్రజలు హాజరయ్యే అవకాశమున్నందున, సభ విజయవంతానికి పార్టీ నాయకత్వం వివిధ కమిటీలను ఏర్పాటుచేసి బాధ్యతలు అప్పగించింది.

  1. సలహా కమిటీ: సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు, అయ్యన్నపాత్రుడు, కళావెంకట్రావు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కావలి ప్రతిభాభారతి.
  2. సమన్వయ కమిటీ : కింజరాపు అచ్చెన్నాయుడు, దామచర్ల సత్య, రవికుమార్, మంతెన సత్యనారాయణరాజు, రాంగోపాల్ రెడ్డి, బీద మస్తాన్ రావు.

3 మీడియా కమిటీ – సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టిడి జనార్దన్, బివి వెంకట్రాముడు, ఆలూరి రమేష్.

  1. సభా ప్రాంగణ కమిటీ: నిమ్మకాయల చినరాజప్ప, పల్లా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ, గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ, గణబాబు, భరత్, కూన రవికుమార్.
  2. ఫుడ్ & వాటర్ కమిటీ: అయ్యన్నపాత్రుడు, దేవినేని ఉమ, పీలా గోవింద్, కెఎస్ఎన్ఎస్ రాజు, జ్యోతుల నెహ్రూ.
  3. వసతి కమిటీ: గంటా శ్రీనివాసరావు, బుద్దా వెంకన్న, దీపక్ రెడ్డి, గండి బాబ్జి, వీరంకి గురుమూర్తి, వాసు.
  4. పార్కింగ్ కమిటీ: రామరాజు (ఉండి ఎమ్మెల్యే), చింతమనేని ప్రభాకర్, వెలగపూడి రామకృష్ణ, నజీర్.
  5. వేదిక నిర్వహణ కమిటీ: నిమ్మల రామానాయుడు, దీపక్ రెడ్డి, రవినాయుడు.
  6. వాలంటీర్స్ కోఆర్డినేషన్ కమిటీ: గణబాబు, రాంగోపాల్ రెడ్డి, ప్రణవ్ గోపాల్, బ్రహ్మం చౌదరి.
  7. రవాణా కమిటీ: ఆలపాటి రాజేంద్రప్రసాద్, పెందుర్తి వెంకటేష్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి.
  8. ఆర్థిక వనరుల కమిటీ: అనగాని సత్యప్రసాద్, ప్రత్తిపాటి పుల్లారావు, బిసి జనార్దన్ రెడ్డి.
  9. మెటీరియల్ కమిటీ: శ్రీకాంత్ (పార్టీ కార్యాలయం), మలిశెట్టి వెంకటేశ్వర్లు.
  10. విశాఖ బ్రాండింగ్ కమిటీ: వెలగపూడి రామకృష్ణ, గణబాబు, గండి బాబ్జి.
  11. మాస్టర్ ఆఫ్ సెర్మనీ: కింజరాపు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, ఎంఎస్ రాజు
Advertisement

తాజా వార్తలు

Advertisement