Saturday, May 18, 2024

Seriel Killer – 20 మందిని హత్య చేసిన తాంత్రికుడు… తెలంగాణ అంతటా గాలింపులు

హైదరాబాద్ – తాంత్రికుడి పేరుతో గుప్తనిధులు, ఉద్యోగాలు, మంచి అవకాశాలు.. ఇలాంటి అనేక రకాల కారణాలతో జనాలను మభ్యపెట్టి, మాయచేసి.. మోసం చేయడం.. ఆ తరువాత వారిని హత్య చేయడం ఇతని పని. ఆ నేరం అతనిపై పడకుండా తప్పించుకుని తిరగడం ఇతని పరిపాటిగా మారింది. అలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 20మందిని హత్య చేశాడు ఈ సీరియల్ కిల్లర్. ఈ విషయం తెలిసిన పోలీసులు షాక్ తిన్నారు. అయితే, ఇదంతా ఆథ్యాత్మికత, తాంత్రిక పూజల ముసుగులో చేయడం కలకలం రేపుతోంది. అమాయక ప్రజలను హత్యలు చేస్తూ దొరకకుండా తప్పించుకుంటున్నాడు.

వివరాలలోకి వెళితే హైద్రాబాద్ లో ఓ హత్య కేసుతో ఈ తాంత్రికుడి డొంక అంతా కదిలింది. ఈ కేసులో పోలీసులకు చిన్న క్లూ దొరికడంతో దాన్ని పట్టుకుని దర్యాప్తు చేస్తుంటే.. అసలు విషయం అంతా వెలుగులోకి వచ్చింది. అసలు హంతకుడు ఎవరో తేలడంతో పాటు అతను ఇప్పటికే 20 హత్యలు చేసిన సీరియల్ కిల్లర్ అని తేలడంతో పోలీస్ బాసులు షాక్ ఖంగుతిన్నారు. అంతేకాదు ఆ తాంత్రికుడి మీద ఇప్పటికే , నాగర్ కర్నూల్, ఏపీలోని పలు పోలీస్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయని గుర్తించారు.


తాంత్రిక పూజలతో ఎర వేసి, వారిని తన మాటలతో నమ్మించి.. అదును చూసి వారిని చంపేయడం ఇతనికి మామూలుగా మారింది. ఇదంతా ఒక ఎత్తైతే.. రెండేళ్ల క్రితం గుప్త నిధుల కోసం ఓ కుటుంబంలోని నలుగురిని చంపేశాడు ఈ తాంత్రికుడు. ఇటీవల ఉద్యోగం ఇప్పిస్తానని ఓ వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకుని ఆ తరువాత అతను ఉద్యోగం రాకపోవడంతో ప్రశ్నించడంతో.. అతనిని కూడా చంపేశాడు. అయితే.. హైదరాబాద్ లో ఓ హత్య కేసు దర్యాప్తులో తాంత్రికుడికి సంబంధించిన షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. దీంతో నిందితుడి కోసం పోలీసుల గాలింపు చేపట్టారు. తెలంగాణ అంతటా అతడి కోసం పోలీసులు గాలిస్తన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement