Friday, May 3, 2024

నారా లోకేష్ నేటి పాద‌యాత్ర షెడ్యూల్..

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రారంభమై నేటికి నాలుగో రోజుకు చేరుకుంది. పాదయాత్ర కుప్పం నియోజకవర్గంలో ప్రారంభమై… పలమనేరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ ఉదయం 8 గంటలకు పాదయాత్ర చెల్దిగానిపల్లి క్యాంపు స్థలం నుంచి ప్రారంభమైంది.

యువగళం పాదయాత్ర నేటి షెడ్యూల్:
ఉదయం 8 గంటలకు కుప్పం నియోజకవర్గంలోని చెల్దిగానిపల్లి క్యాంపు స్థలం నుండి పాదయాత్ర ప్రారంభం. 8:45కి పలమనేరు నియోజకవర్గంలోనికి పాదయాత్ర ప్రవేశం. 9:30కి వి.కోట మండలం కెంగుటం పంచాయతీ కోరకుంటలో రెడ్డి సామాజికవర్గంతో ముఖాముఖి. 10:10కి వి.కోట మండలం పడిగల కుప్పం వద్ద మల్బరీ రైతులతో ముఖాముఖి. 10:40కి వి.కోట మండలం గాంధారమాకులపల్లెలో వడ్డెర సామాజికవర్గం ప్రజలతో ముఖాముఖి. 12:20కి వి.కోట మండలం జీఎంఆర్ కళ్యాణమండపంలో యువతతో సమావేశం. మధ్యాహ్నం 02:05కి వి.కోట మండలం పీఎంఆర్ సత్రం వద్ద భోజన విరామం. 04:15కి వి.కోట మండలం ఆఘ కళ్యాణమండపం ఎదురుగా ఉన్న స్థలంలో ముస్లిం మైనారిటీలతో ముఖాముఖి. 07:20కి వి.కోట మండలం కృష్ణపురం టోల్ గేట్ సమీపంలో రాత్రిపూట బస చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement