Wednesday, May 8, 2024

అతివేగం ప్రాణం తీసింది.. డివైడర్ ను ఢీకొని వ్యక్తి మృతి..

వాజేడు, ప్రభ న్యూస్: అతివేగమే ప్రాణం తీసింది డివైడర్ ను ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన ములుగు జిల్లా వాజేడు మండలంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పేరూరు ఎస్సై హరీష్ తెలిపిన వివరాల ప్రకారం పస్రా గ్రామానికి చెందిన మసిక సుబాష్ అనే వ్యక్తి వాజేడు మండలం చండ్రుపట్ల వెళ్లి తిరిగి పస్రా వెళుతుండగా కడికల్ చివరిలో రాత్రి 9 గంటల సమయంలో అతి వేగంతో డ్రైవ్ చేస్తూ డివైడర్ ను ఢీకొట్టాడు. తలపై తీవ్రంగా గాయం కావడంతో అక్కడికి అక్కడే మృతి చెందాడు. మృతుని అన్న ప్రభాకర్ ఫిర్యాదు మేరకు పేరూరు ఎస్సై హరీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు అతివేగం వలన ఈ ప్రమాదం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement