Friday, May 3, 2024

ఆ నాటకాన్ని జగన్ కట్టిపెట్టాలి: నారా లోకేష్

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సెటైర్లు వేశారు. ఎయిడెడ్ విద్యాసంస్థలకు ప్రభుత్వం ఇచ్చిన ఆప్షన్లపై విమర్శించారు. తప్పుడు పనులు చేసి, కప్పిపుచ్చుకునే క్రమంలో తన తప్పులను తానే బయటపెట్టుకునే గొప్పదనం జగన్ దని అన్నారు. లోకేశ్ జీవో 42 సరిగా చదవలేదని… అందులో రెండు కాదు మూడు ఆప్షన్లు ఇచ్చామంటూ ప్రజలను తప్పుదోవ పట్టించబోయారని చెప్పారు. ఇప్పుడు మరో రెండు ఆప్షన్లను ఇస్తున్నామని మెమో జారీ చేసి అడ్డంగా బుక్కయ్యారని ఎద్దేవా చేశారు. ఆప్షన్ల నాటకాన్ని జగన్ కట్టిపెట్టి, ఎయిడెడ్ విద్యా సంస్థల ఆస్తులను కొట్టేయాలనే కుట్రతో తెచ్చిన జీవో 42, 50, 51, 19లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: Dalitha Bandhu: దళితబంధ పథకానికి నిధులు విడుదల!

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి 

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement