Friday, April 26, 2024

Breaking : టీ కాంగ్రెస్ నేత‌ల‌తో ఏఐసీసీ ఇంఛార్జి భేటీ..వీహెచ్ సంచ‌ల‌న వ్యాఖ్యలు..

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశాల మేర‌కు హుజురాబాద్ ఉప ఎన్నిక‌లో ఓట‌మిపై స‌మీక్ష నిర్వ‌హించారు. హుజూరాబాద్ ఓట‌మిపై ఏఐసీసీ స‌మీక్ష చేప‌ట్టింది. సాగ‌ర్,దుబ్బాక‌,జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లో..ఓట‌మిపైనా చ‌ర్చించాల‌ని కేసీ వేణుగోపాల్ కి పొన్నం లేఖ రాశారు. టీకాంగ్రెస్ నేత‌ల‌తో ఏఐసీసీ ఇంఛార్జి కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యారు. ఈ భేటీలో టీపీసీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి,సీఎల్పీ నేత భ‌ట్టి,వీహెచ్,దామోద‌ర‌,ష‌బ్బీర్ ఆలీ,పొన్నం,మ‌ధుయాష్కీ పాల్గొన్నారు. కాగా ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో సహా పూర్తిస్థాయిలో స‌మీక్ష జ‌ర‌గాల‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీ హ‌నుమంత‌రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు,ఇందిర‌మ్మ ఓటు బ్యాంకు ఎటు పోయింద‌ని వీహెచ్ ప్ర‌శ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement