Tuesday, April 30, 2024

కుప్పంలో కుక్కల్లా మొరుగుతున్నారు: వైసీపీపై నారా లోకేశ్

ఏపీలోని జగన్ సర్కార్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటిస్తున్న ఆయన.. వైసీపీపై నిప్పులు చెరిగారు. కుప్పంలో అలజడులు సృష్టించేందుకు వైఎస్సార్సీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కక్ష సాధింపుతో కుప్పం నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయడం లేదని మండిపడ్డారు. రెండున్నరేళ్లుగా కుప్పంను పట్టించుకోని వైసీపీ నాయకులు ఇప్పుడు వచ్చి కుక్కల్లా మొరుగుతున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ రౌడీలు, గుండాలు, ఎర్ర చందనం స్మగ్లర్లు ప్రశాంతమైన కుప్పం వచ్చి అరాచకం చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మద్యం బాటిల్ దగ్గర్నుంచి నిత్యం తినే పప్పు, ఉప్పు వరకు అన్ని రకాల ధరలను వైసీపీ అమాంతం పెంచేసిందని ధ్వజమెత్తారు. రౌడీలు గూండాలకు భయపడకుండా ఓటు వేసి టీడీపీని గెలిపించాలని లోకేష్ కోరారు. త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా ఉద్యమం రానుందని.. అందులో జగన్ కొట్టుకుపోతారని జోస్యం చెప్పారు. 2024లో టీడీపీ విజయం ఖాయమని నారా లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: ఇది ప్రజాస్వామ్యమా… ఆటవిక రాజ్యమా?: సూర్యపేటలో జైభీమ్ ఘటనపై రేవంత్ ఫైర్

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి 

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement