Monday, April 29, 2024

ఇది ప్రజాస్వామ్యమా… ఆటవిక రాజ్యమా?: సూర్యపేటలో జైభీమ్ ఘటనపై రేవంత్ ఫైర్

సూర్యాపేట‌ జిల్లాలో ‘జై భీమ్’ త‌ర‌హా ఘ‌ట‌నపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. జైభీమ్ సినిమా తరహాలో చోరీ కేసులో ఓ గిరిజనుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని అతడిని చిత్రహింసలు పెట్టడం సంచలనమైంది. ఈ ఘటనపై టీ.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు.

‘టీఆర్ఎస్ నికృష్టపు పాలనలో మానవహక్కులు ఉరికొయ్యకు వేలాడుతున్నాయి. నిన్న మరియమ్మ, శీలం రంగయ్యల ప్రాణాలు ఖాకీలు తోడేశారు. ఇదేం దారుణం అని హైకోర్టు కన్నెర్ర చేస్తున్న సమయంలోనే వీర శేఖర్ పై అన్యాయంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. కేసీఆర్ ఇది ప్రజాస్వామ్యమా… ఆటవిక రాజ్యమా?’ అని రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు.

కాగా, సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని రామోజీ తండాకు చెందిన గుగులోతు వీరశేఖర్‌ అనే గిరిజన యువకుడిపై పోలీసులు థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించారు. చోరీ కేసులో అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టారు. తనకేమీ తెలియదని గిరిజ‌నుడు మొత్తుకున్నప్పటికీ, అత‌డి మాట‌లు వినకుండా కాళ్లు కట్టేసి దారుణంగా హింసించారు. పోలీసుల‌ విచారణ అనంతరం ఇంటికి వెళ్లిన వీరశేఖర్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కాళ్లు ఉబ్బిపోయి, నడవలేని స్థితికి చేరాడు. దీంతో బాధితుడి కుటుంబ సభ్యులు అత‌డిని ఆసుప‌త్రిలో చేర్పించి, అనంతరం పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. ఎస్సైపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన చేశారు.

ఇది కూడా చదవండి: weather report: తెలంగాణలో 3 రోజుల పాటు వర్షలు!

Advertisement

తాజా వార్తలు

Advertisement