Sunday, May 5, 2024

రైతులదే అంతిమ విజయం: లోకేష్

జై అమరావతి ఉద్య‌మానికి 600 గడిచిన సందర్భంగా టిడిపి నేత నారా లోకేష్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని అంతం చేసేందుకు వైసీపీ గల్లీ నుండి ఢిల్లీ వరకూ చేసిన కుట్రలన్నింటినీ రైతులు ఓర్పుతో ఛేదించారని అన్నారు. వైసీపీ నాయకులు బెదిరింపుఅంతిమలు, అణచివేత, అరెస్టులకు అదరం…బెదరం అంటూ 600 రోజులుగా జై అమరావతి ఉద్యమంలో భాగస్వామ్యమైన రైతులు, మహిళలు, యువతకు ఉద్యమాభివందనాలు’ అని లోకేశ్ పేర్కొన్నారు. రోడ్లను సైతం తవ్వేస్తూ అమరావతిని చంపేస్తాం అని ఆనందపడుతున్న వైఎస్ జ‌గ‌న్ గారూ! మీరు తవ్వుకున్న ఆ గుంతల్లోనే వైకాపా ప్రభుత్వాన్ని ప్రజలు పూడ్చిపెట్టబోతున్నారు. అవమానాల్ని భరిస్తూనే రాజధాని అమరావతి గొప్పతనాన్ని దేశమంతా తెలిసేలా చేసిన రైతులనే అంతిమ విజయం వరించబోతుంది’ అని నారా లోకేశ్ చెప్పారు.

ఇది కూడా చదవండి: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం

Advertisement

తాజా వార్తలు

Advertisement