Friday, April 26, 2024

ప్రజల కలను చెల్లాచెదురు చేశారు – అచ్చెన్నాయుడు

రైతులు 600 రోజులుగా అమరావతి కోసం చేస్తున్న పోరాటాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల పోరాటానికి టీడీపీ సంపూర్ణ మద్ధతు ఇస్తుందన్నారు. రాష్ట్ర ప్రజల కలను జగన్ రెడ్డి చెల్లా చెదురు చేశారని విమర్శించారు. భవిష్యత్‌ను అంధకారం చేస్తున్న జగన్మోహన్ రెడ్డిపై ప్రజలు తిరగబడాలని పిలుపు ఇచ్చారు. అసెంబ్లీలో రాజధానిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని సీఎం జగన్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

రాజధానికి కనీసం 30వేల ఎకరాలు తగ్గకుండా ఉండాలన్నారని, గొప్ప విజన్‌తో రూపొందించిన అమరావతిని ధ్వంసం చేయడానికి మనసెలా ఒప్పిందని ప్రశ్నించారు. చర్చి, మసీదు, గుళ్ల నుండి మట్టిని తెచ్చి అమరావతికి శంకుస్థాపన చేస్తే.. దాన్ని అవమానించేలా జగన్ వ్యవహారం ఉందని మండిపడ్డారు. రైతుల పోరాటానికి ప్రతిఫలం దక్కుతుందని, ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగడం ఖాయమని అచ్చెన్నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement