Tuesday, April 23, 2024

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ మరో పతకం సాధించింది. శనివారం జరిగిన రెజ్లింగ్ మ్యాచ్‌లో భజరంగ్ పునియాను కాంస్య పతకం వరించింది. రెజ్లింగ్ పురుషుల 65 కిలోల విభాగంలో భజరంగ్ పునియా పతకం సాధించాడు. శనివారం మధ్యాహ్నం కజకిస్తాన్ దేశానికి చెందిన జేకొవ్‌తో భారత రెజ్లర్ భజరంగ్ పునీయా పోటీ పడ్డాడు.

ఈ పోటీల్లో భారత రెజ్లర్ భజరంగ్ పునియా ఘన విజయం సాధించాడు. కజకిస్తాన్ రెజ్లర్ జెకొవ్‌పై 8-0 తేడాతో భజరంగ్ పునియా విజయం సాధించాడు. ఈ విజయంతో కాంస్య పతకం భారత్ వశం అయింది. ఇక ఈ కాంస్య పతకంతో భారత్ కు వచ్చిన పతకాల సంఖ్య.. ఆరుకు చేరింది. ఇప్పటివరకు టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఆరు పతకాలు వచ్చాయి. మొత్తం ఆరు పథకాల్లో రెండు రజతాలు, నాలుగు కాంస్య పతకాలు ఉన్నాయి.

ఈ వార్త కూడా చదవండి: టోక్యో ఒలింపిక్స్‌.. గోల్ఫ్ ఫైనల్లో చేజారిన పతకం

Advertisement

తాజా వార్తలు

Advertisement