Saturday, May 4, 2024

అమరావతి@600 రోజులు.. రైతులకు లోకేష్ ఉద్యమాభివందనాలు

అమరావతిని అంతం చేసేందుకు వైసీపీ నాయకులు గల్లీ నుండి ఢిల్లీ వరకూ చేసిన కుట్రలన్నింటిని రైతులు ఓర్పుతో చేధించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అమరావతి కోసం రైతులు చేస్తున్న ఉద్యమం 600 రోజులకు చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెదిరింపులు, అణిచివేత, అరెస్టులకు అదరం…బెదరం అంటూ 600 రోజులుగా జై అమరావతి ఉద్యమంలో భాగస్వామ్యమైన రైతులు, మహిళలు, యువతకు ఉద్యమాభివందనాలు తెలిపారు. రోడ్లను సైతతం తవ్వేస్తూ అమరావతిని చంపేస్తామని ఆనందపడుతున్న జగన్ రెడ్డి గారూ! మీరు తవ్వుకున్న ఆ గుంతల్లోనే వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు పూడ్చిపెట్టబోతున్నారని హెచ్చరించారు. అవమానాల్ని భరిస్తూనే రాజధాని అమరావతి గొప్పతనాన్ని దేశమంతా తెలిసేలా చేసిన రైతులనే అంతిమ విజయం వరించబోతుందని లోకేష్ విశ్వాసం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement