Wednesday, April 24, 2024

త్వరలో మారుతి బిగ్ ప్రాజెక్ట్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు డైరెక్టర్ మారుతి. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన తర్వాత ప్రాజెక్టుల గురించి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నానని… ఇందులో రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు అని చెప్పుకొచ్చారు. అలాగే ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తయిందని తెలిపారు.

మరోవైపు యంగ్ హీరో సంతోష్ శోభన్, మెహరీన్ కాంబినేషన్లో మంచి రోజులు వచ్చాయి సినిమా చేస్తున్నానని ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయిందని తెలిపారు. ఈ సినిమా తర్వాత త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని అలాగే దీని తర్వాత పెద్ద హీరోలతో సినిమా ఉందని బిగ్ ప్రాజెక్ట్ కు దర్శకత్వం చేయబోతున్నా అని తెలిపారు. మరి మారుతి చేయబోయే ఆ ప్రాజెక్ట్ ఏంటి అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement