Wednesday, May 8, 2024

మంత్రి పెద్దిరెడ్డిపై మండిపడ్డ నారా లోకేశ్..

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జనసేన బీసీ నేత రామచంద్ర యాదవ్ పై వైసీపీ దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. రైతు సదస్సు నిర్వహించాలనుకోవడం ద్రోహమా అని ప్రశ్నించారు. ప్రశ్నించే వారి ప్రాణాలు తీయడమే మీకు తెలిసిన ప్రజాస్వామ్యమా అని నిలదీశారు. వైసీపీ దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం దారుణమని నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ఆధ్వర్యంలో వైసీపీ జయహో బీసీ సభ నిర్వహిస్తున్నారన్నారు. ఇటు పుంగనూరులో బీసీ నేతలపై పెద్దిరెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement