Tuesday, May 7, 2024

Vizag: కనకరాజు కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన నారా భువ‌నేశ్వ‌రి

తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర కొనసాగుతోంది. అందులో భాగంగా ఇవాళ విశాఖలో నారా భువనేశ్వరి పర్యటించారు. 45వ డివిజన్‌లోని తాటిచెట్లపాలెంలో చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన తెదేపా కార్యకర్త కనకరాజు కుటుంబాన్ని ఆమె పరామర్శించారు.

శ్రేణులకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబసభ్యులకు రూ.3 లక్షల ఆర్థికసాయం అందజేశారు. అనంతరం కార్యకర్తలు, నాయకులు, ప్రజలను పలకరించారు. భువనేశ్వరి వెంట ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement