Sunday, April 28, 2024

Corona Count – ఒక్కరోజే 761 కొత్త కేసులు.. క‌రోనాతో 12 మంది మృతి

దేశంలో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో 761 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గ‌డిచిన 24 గంట‌ల‌లో 838 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం వైరస్‌ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,44,78,885కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,334 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గురువారం ఒక్కరోజే 12 మరణాలు నమోదయ్యాయి. కేరళలో ఐదుగురు, కర్నాటకలో నలుగురు, మహారాష్ట్రలో ఇద్దరు, ఉత్తరప్రదేశ్‌లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 5,33,385కి ఎగబాకింది.

యాక్టివ్ కేసులు త‌క్కువే..
ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 0.01 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.81 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇక ఇప్పటి వరకూ 220.67 కోట్ల (220,67,79,081) కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది. మరోవైపు దేశంలో కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ జేఎన్‌.1 (JN.1) కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ తరహా కేసులు 12 రాష్ట్రాలకు పాకాయి. జనవరి 3వ తేదీ వరకూ దేశంలో జేఎన్‌.1 కేసులు 541కి పెరిగాయి. ఈ మేరకు సంబంధిత వర్గాలు గురువారం వెల్లడించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement