Wednesday, May 1, 2024

Phd Awarded – ఇస్రో చైర్మ‌న్‌కు డాక్ట‌రేట్ ..ప్ర‌దానం చేసిన జెఎన్టీయు వీసీ..

హైద‌రాబాద్ – పరిశ్రమల వృద్ధి, హెరిటేజ్‌లో హైదరాబాద్‌ అగ్రస్థానంలో ఉన్నదని ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ అన్నారు. చంద్రయాన్‌-3 దేశం మొత్తం గర్వించేలా చేసిందని తెలిపారు. పరాజయాలను అధిగమించి మూడు ప్రాజెక్టుల్లో విజయాల‌ను సాధించామని చెప్పారు. జేఎన్‌టీయూ హెచ్‌ కాన్వకేషన్‌కు ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వర్సిటీ వీసీ నరసింహా రెడ్డి ఇస్రో చైర్మన్‌కు గౌరవ డాక్టరేట్‌ అందించారు.

అనంతరం సోమనాథ్‌ మాట్లాడుతూ.. వర్సిటీలతో కలిసి పనిచేయడంపై వీసీతో చర్చించానన్నారు. తక్కువ ఖర్చుతో ప్రాజెక్టులు చేసేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. అంతరిక్ష రంగంలో మరిన్ని అంకురాలు, పరిశ్రమలు రావాలని చెప్పారు. తన జీవితంలో రాకెట్‌ రూపకల్పనలో ఎన్నో తప్పులు చేశానని పేర్కొన్నారు. అపజయం గెలుపునకు పాఠం లాంటిదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement